ఆలయ నిర్మాణానికి కాంగ్రెస్‌ అనుకూలం

న్యూఢిల్లీ,నవంబర్‌9(జనం సాక్షి) : వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు
కాంగ్రెస్‌ పేర్కొంది.  అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తాము అనుకూలమని ఆ పార్టీ అధికార ప్రతినిధి రన్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు. సుప్రీం తీర్పు ఆలయ నిర్మాణానికి ద్వారాలు తెరవడమే కాదు బీజేపీ, ఇతర పక్షాలకు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ద్వారాలు మూసుకున్నాయని ఆయన పేర్కొన్నారు.