ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: 25మంది మృతి

hhh  హైదరాబాద్‌: సౌదీ అరేబియాలోని జీజన్‌ నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 25మంది మృతిచెందగా, మరో 100 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న ఐసీయూ, మెటర్నిటీ వార్డులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయని, ఆ తర్వాతపై అంతస్తుకు వ్యాపించాయని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి గాల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.