ఇండియా గేట్‌ పేల్చేస్తాం

బెదిరింపు కాల్‌తో ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) :
ఇండియాగేట్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్‌ ఢిల్లీలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ముష్కరులు జంట పేలుళ్లకు పాల్పడి 16 మందిని హతమార్చడం, 120 మందిని క్షతగాత్రులుగా మార్చడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన ఇండియాగేట్‌ వద్దకు చేరుకున్న పోలీసులు, భద్రతా దళాలు అక్కడి పర్యాటకులను, జవాన్లను వెంటనే ఖాళీ చేయించి వెంటనే బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. బాంబ్‌ పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్‌ వచ్చిన కొద్ది సేపటికే భద్రతా బలగాలు ఇండియాగేట్‌ను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి.