ఇది అత్యంత విషాదకరమైన ఘటన : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ జంట పేలుళ్ల ఘటనను లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్‌ ఖండించారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటనగా ఆమె పేర్కొన్నారు. లోక్‌సభలో జంట పేలుళ్ల ఘటనపై జరిగిన చర్చలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఐక్యంగా పోరాడాలని కోరారు. కేంద్రం వద్ద దాడుల సమాచారం ఉన్నా.. ఘటనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడంతో ఉగ్రవాదులు పై చేయి సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.