ఇద్దరు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కస్టడీ
న్యూఢిల్లీ : హైదరాబాద్ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులను 4 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. వీరిని హైదరాబాద్కు తరలించిన ఎన్ఐఏ అధికారులు విచారణ చేపట్టనున్నారు.