ఈ సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నా : ప్రధాని మన్మోహన్‌సింగ్‌

ఢిల్లి: నేటినుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలు నిర్మాణాత్మకంగా, ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. మరోపక్క సమావేశాలు ఇంకా ప్రారంభమన్నా కాలేదు, పార్లమెంటు ముఖద్వారం వద్ద బైఠాయించి తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు.