ఉగ్రవాదుల దాడులను ఆరికట్టడంలో ప్రధాని విఫలం : భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదుల దాడులు పేట్రేగిపోతున్న చర్యలు తీసుకోవడంతో ప్రధాని విఫలమయ్యారని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు.హైదరాబాద్‌, ముంబయిలో ఉగ్రవాదుల దాడులపై కేంద్రం నిఘా కొరవడిందని మండిపడ్డారు. దేశంలో శాంతి ,సామరస్యాలు నెలకొల్పేందుకు భాజపా కృషి చేస్తోందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై రాజ్‌నాధ్‌ ప్రశంసలు కురిపించారు. విదేశాల్లో కూడా మోడీ పేరు మారుమోగిపోతోందని కొనియాడారు. పలు దేశాలు మోడీ అభివృద్ధి మార్గాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు.