ఎయిర్‌ ఏసీయా -టాటా కొత్త ఎయిర్‌లైన్‌కి ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ : మలేసియాకు చెందిన ఎయిర్‌ ఏసియా సంస్థ భారత్‌కి చెందిన టాటా గ్రూపుతో కలిసి ప్రారంభించ తలపెట్టిన కొత్త ఎయిర్‌లైన్‌కి ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఎయిర్‌ఏసియా ప్రతిపాదన ఆమోదం పొందిందని ఎఫ్‌డీఐ విధివిధానాల ప్రకారం 49 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రూ. 80 కోట్లు తొలిదశ పెట్టుబడిగా పెడుతున్నట్లు సమాచారం.