ఎల్లుండికి వాయిదా పడిన లోక్సభ
న్యూఢిల్లీ : 2జీ, బొగ్గుకుంభకోణం వ్యవహారాలపై లోక్సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒక సారి వాయిదా అనంతరం లోక్సభ తిరిగి ప్రారంభకాగానే ప్రధాన పత్రిపక్షం భాజపాతోపాటు విపక్ష సభ్యులు నిరసన చేపట్టి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సభకు ఎల్లుండికి వాయిదా వేశారు.