ఏరోమాట్రిక్స్‌ మాజీ సభ్యుడిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ : అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం విచారణను సీబీఐ వేగవంతం చేసింది. కుంభకోణంతో సంబంధం ఉన్న పలువురు మాజీ అధికారులను విచారిస్తోంది. దీనిలో భాగంగా ఏరోమాట్రిక్స్‌ బోర్డు మాజీ సభ్యుడు గౌతమ్‌ ఖైతాన్‌ను ఈరోజు సీబీఐ ప్రశ్నించింది.