ఐఎన్‌ఐ ఏజెంట్‌తో సంభాషణ వ్యవహారంపై విచారణ

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎప్‌ఐ ఏజెంట్‌తో ఎన్‌ఎన్‌జీ మేజర్‌ సంభాషించారన్న వార్తలపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు ఎన్‌ఎన్‌జీ ఉన్నతాధికారులు తెలిపారు. ఐఎన్‌ఐ ఏజెంట్‌కు హైదరాబాద్‌ పేలుళ్ల వివరాలను ఎన్‌ఎన్‌జీ మేజర్‌ అందించారని ఐబీ వద్ద సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనను ఎన్‌ఎన్‌జీ తీవ్రంగా పరగణించింది. దేశద్రోహానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.