ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న భాజపా జాతీయ సమావేశాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్టు ఆయన తెలియజేశారు.