ఒక కంట కన్నీరు.. మరోకంట పన్నీరు


భావోద్వేగానికి లోనైన అద్వానీ
న్యూఢిల్లీ, మార్చి 2 (జనంసాక్షి):
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీనియర్‌ నేత అద్వానీ ఒక దశలో చిరునవ్వులు చిందించగా, మరో దశలో భావోద్వేగానికి గురయ్యారు. కింద వున్న దృశ్యాల్లో వాటిని చూడవచ్చు. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షడు రాజ్‌నాథ్‌సింగ్‌, నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ, ముఖ్యమంత్రులు నరేంద్రమోడీ, రమణ్‌సింగ్‌, శివరాజ్‌సింగ్‌ తదితర పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
బీజేపీ భేటీలో మోడీకి అనూహ్య ప్రజాదరణభారతీయ జనతా పార్టీ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి శనివారం హాజరైన గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి అనూహ్య ప్రజాదరణ లభించింది. వక్తలు ఆయన పేరును ప్రస్తావించినప్పుడల్లా సభలో కరతాళధ్వనులు మిన్నంటాయి. పార్టీ కొత్తఅధ్యక్షుడిగా రాజ్‌నాధ్‌సింగ్‌ ఎంపికను ఆమోదించడమేకౌన్సిల్‌ భేటీలో ప్రధాన ఎజెండా అయినప్పటికీ, మోడీయే ప్రధాన ఆకర్షణగా నిలిచారు.