ఒక టీనేజీ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన

ఢిల్లీ: సామూహిళ అత్యాచారానికి గురైన ఒక టీనేజీ బాలిక ఆత్యహత్యయత్నం చేసింది. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగిన ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో ఇంటెన్సిప్‌కేర్‌లో చికిత్స పొందుతోంది. మార్చి 15న ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి తొమ్మిది రోజుల పాటు బంధించి అత్యాచారానికి పాల్పడిన 8 మందిలో పోలీసులు ఇప్పటికి ముగ్గురిని మాత్రమే అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా ఐదేళ్ల బాలికపై అత్యాచారం తాలూకు వార్తలు చూసిన ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యాయత్నం చేసిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.