ఒడిశాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ… ఏడుగురు మృతి

o6g36apaఒడిశా, ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం చౌరస్తాలో రోడ్డు పక్కన ఉన్న కార్మికులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు