ఒడిశాలో మావోయిస్టుల ఘాతుకం…

ఒడిశా : మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు కాల్చి చంపారు. కలిమెల పోలీసుస్టేషను పరిధిలోని కన్నగూడలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో రమామాడి, తోమా మాడిలున్నారు. ఈ సంఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది.