కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభం

మల్దకల్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని పావనంపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ
అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.18 ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలు చేస్తారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు గ్రామంలో ప్రతి ఒక్కరు కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.వైద్యాధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో,ఎంపీడీవో కృష్ణయ్య,డాక్టర్ నవీన్, సర్పంచ్ శారద జయరాములు,ఎంపిఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకుడు అజయ్, కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.