కమర్షియల్‌ సిలిండర్‌ ధర వంద పెంపు

న్యూఢల్లీి,డిసెంబర్‌1((జనంసాక్షి):):  కమర్షియల్‌ గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. దేశంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌  ధర రూ.100.50 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఈ ధరలు బుధవారం నుంచే  అమల్లోకి వచ్చాయని వెల్లడిరచాయి. తాజా పెంపుతో ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,101కి చేరింది. అయితే, 14.2 కేజీ, 5 కేజీ, 10 కేజీ కమర్షియల్‌ సిలిండర్‌?ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు తెలిపాయి. అదేవిధంగా ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో కూడా ఎటువంటి మార్పు చేయలేదని చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. కాగా, నవంబరు 1న కూడా 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.266 పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్‌ 1న రూ.75 పెంచారు.