కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం

ట్రక్కును ఢీకొన్న కారు: నలుగురు దుర్మరణం
బెంగళూరు,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కర్నాటకలోని అత్తిబిలి-సర్జాపూర్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవారిలో ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ఈ ప్రమాదంలో అంజనీ యాదవ్‌(31), నేహా యాదవ్‌, కుమారుడు ద్రువ్‌ యాదవ్‌, అంజనీ యాదవ్‌ స్నేహితురాలు సుబ్రదా సంతోష్‌(27) ఘటనా స్థలంలోనే చనిపోయారు. సంతోష్‌ భర్త, ఆమె కూతురు ప్రస్తుతం చికత్స పొందుతున్నారు. యుపికి చెందిన అంజనీ యాదవ్‌ బెంగళూరులో నివసిస్తున్నారు. ప్రస్తుతం అంజనీ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్‌ సహాయంతో పక్కకు తొలగించారు.