కర్నాటకలో ఘోర ప్రమాదం

చక్కెర కర్మాగారంలో పేలుడు: ఆరుగురు మృతి
బెంగళూరు,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్‌ జిల్లాలోని ఓ చక్కెర పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ముధోల్‌ తాలూకాలోని కులాలీ గ్రామంలో ఉన్న నిరానీ చక్కెర పరిశ్రమలో ఒక్కసారిగా బాయిలర్‌ పేలింది. ఈ ఘటనలో పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. క్షతగాత్రులను సవిూప ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమయంలో కర్మాగారంలో దాదాపు 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల నుంచి ఇప్పటి వరకూ ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కర్మాగారం మాజీ మంత్రి, బుల్గి ఎమ్మెల్యే మురుగేశ్‌ నిరానీదిగా గుర్తించారు.