కర్నూలులో క్రిస్మస్‌ సందడి

కర్నూలు,డిసెంబర్‌24(జనం సాక్షి): నగరంలో క్రిస్మస్‌ సందడి పెరిగింది. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, క్యాండిల్‌ లైటింగ్‌ వేడుకలు జరుగుతున్నాయి. చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. క్రిస్మస్‌ వేడుకలకు అవసరమైన స్టార్లు, ట్రీలు, అలకంరణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. క్రీస్తు జననానికి గుర్తుగా కైస్త్రవులు తమ ఇళ్లపై స్టార్‌లను ఏర్పాటు చేసారు. మార్కెట్లో వివిధ ఆకృతులు, అలంకారాల్లో ఉన్న స్టార్లను, క్రిస్మస్‌ ట్రీలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు. పండుగ రోజున పిల్లలకు
మిఠాయిలు పంచే శాంతాక్లాజ్‌ టోపీలు, కోట్లను కొనుగోలు చేస్తున్నారు. నగరంలో పాత బస్టాండు, అబ్దుల్లాఖాన్‌ ఎస్టేట్‌, మద్దూరునగర్‌, సి.క్యాంపు, నంద్యాల చెక్‌పోస్టు తదితర ప్రాంతాల్లో క్రిస్మస్‌ వేడుకల సామగ్రిని అమ్ముతున్నారు.