కాంగ్రెన్‌వి కుటుంబ రాజకీయాలు : మోడీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కుటుంబ  రాజకీయాలు నడుపుతోందని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కాంగ్రెస్‌కు లేదన్నారు.కాంగ్రెస్‌ను ఓడించాలని దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దేశంలో కాంగ్రెస్‌కు భాజపా ఒక్కటే ప్రత్నామ్నాయమని చెప్పారు. సుపరిపాలనలో భాజపాకు మంచిపేరు ఉందని తెలిపారు. గుజరాత్‌ విజయం భాజపా విజయమని పేర్కొన్నారు.