కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు : శివగౌనీ పెంటగౌడ్

తూప్రాన్ మే 11( జనం సాక్షి) : తెలంగాణలో బి ఆర్ ఎస్ పార్టీ అని ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించిన ఓటు హోదా అని కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అన్నారు.బిఆర్ఎస్ పార్టీలో లో మోసగాళ్లు,దొంగలే మిగులుతరని అన్నారు.మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామనికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివ గౌని పెంట గౌడ్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ శివ గౌని సుగుణ, మజి ఎంపీటీసీ శివ గౌని మంజుల, మాజీ సర్పంచ్ శివగౌని రాజ గౌడ్ వారి 200 మంది అనుచరులతో అనుచరులతో కలిసి నర్సారెడ్డి సమక్షంలోకాంగ్రెస్ పార్టీ లో చేరారు.వారికి నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బిఆర్ఎస్ లో ఉంటే మోసపోవడం తప్ప ఏమిలేదని అన్నారు.ఈ సందర్బంగా సీనియర్ నాయకులు పెంట గౌడ్, తో పాటు 200 మంది చేరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చిట్కుల మహిపాల్ రెడ్డి , మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి , కృష్ణ గౌడ్ , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెంట గౌడ్ , మాజీ తూప్రాన్ మండల ఉపాధ్యక్షుల పురం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ , మాజీ ఎంపీటీసీ శివగౌని మంజుల , మాజీ సర్పంచ్ లు సుగుణ, రాజా గౌడ్ , షాబుద్దీన్ మైనారిటీ మాజీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు కుమ్మరి రాజు, శివ గౌని రాజశేఖర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ విజయ, అంజి యాదవ్, శ్రీకాంత్ గౌడ్, గుర్రం ప్రవీణ్, గణపురం రమేష్, కురాళ్ళ నవీన్ రెడ్డి, సలీం గ్రామ వైస్ ప్రెసిడెంట్ , తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు