కాలుష్యానికి రైతులు కారకులా?


` నివారించడం చేతకాక నెపం పెడతారా!
` నేడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయండి
` మండిపడ్డ సుప్రీం
` పంజాబ్‌,యూపీ సీిఎస్‌లు హాజరుకావాలని ఆదేశం
న్యూఢల్లీి,నవంబరు 15(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీితో పాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో వాయుకాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం, ఢల్లీిలోని ఆప్‌ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం మరోసారి మందలించింది. వాయు కాలుష్యానికి దుమ్ము, భారీ వాహనాలు, పరిశ్రమలు, భవన నిర్మాణ పనులు వంటివే ప్రధాన కారణాలని సోమవారం స్పష్టం చేసింది. ఢల్లీిలో వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌ విచారించింది. మంగళవారంలోగా నిర్మాణ పనులు, అనవసర రవాణా సేవలను నిలిపివేసేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. సమావేశానికి హాజరుకావాలంటూ పంజాబ్‌, యూపీ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. అంతకు ముందు ఢల్లీిలో వాయు కాలుష్యం కట్టడికి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించేందుకు తాము సిద్ధమేనని సుప్రీం కోర్టుకు ఢల్లీి ప్రభుత్వం తెలిపింది. ఢల్లీితో పాటు ఎన్‌సీఆర్‌ పరిధిలోని మిగతా రాష్టాల్లోన్రూ లాక్‌డౌన్‌ విధిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు న్యాయస్థా నానికి అఫిడవిట్‌ సమర్పించింది.ఈ సందర్భంగా వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు కొంతకాలం పాటు మూసివేతకు అవకాశం ఉన్న పరిశ్రమలు, పవర్‌ప్లాంట్ల గురించి రెండు ప్రభుత్వాలు సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వాహనాల కదలికలను సైతం నిలిపివేయాలని సూచించింది. పంట వ్యర్థాలు కాల్చడమే.. ఢల్లీి, ఈశాన్య రాష్టాల్ర కాలుష్యానికి ప్రధాన కారణం కాదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. పంటవ్యర్థాలు కాల్చడం వల్ల 10శాతం మాత్రమే కాలుష్యం ఏర్పడు తోందని తెలిపింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వాయు కాలుష్యానికి రవాణా, పరిశ్రమలు, ట్రాఫిక్‌ అని.. తక్షణమే తగిన చర్యలు చేపడితే.. కాలుష్యాన్ని తగ్గించొచ్చని పేర్కొన్నారు. సందర్భంగా పరిశ్రమలు మూసివేయడమే కాకుండా వాహనాలను అడ్డుకోగలరా? అంటూ కేంద్రం, ఢల్లీి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు.. మూసివేయగల పవర్‌ ప్లాంట్ల సమాచారాన్ని అందించాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమాధానాలు ఇచ్చేందుకు మంగళవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు తాము ఆదేశాలివ్వడం దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. కేసు విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.