కాశ్మీర్‌లో అడుగు పెడితే లేపేస్తాం

రాజస్థాన్‌ యువకుడికి బెదరింపులు
జయపుర,అక్టోబర్‌5 (జనంసాక్షి) : కశ్మీర్‌లో అడుగుపెట్టావో లేపేస్తాం..’అంటూ రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడికి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. దీంతో అతడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కోటా ప్రాంతానికి చెందిన నిఖిల్‌ పాల్‌ సింగ్‌ ఇటీవల..కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ వెళ్లేందుకు ఓ సైకిల్‌ టూర్‌ ఎ/-లాన్‌ చేశాడు. తన మిత్రులతో కలిసి ఓ బృందంగా ఏర్పడి ఈ టూర్‌కు వెళ్లాలనేది అతడి ఎ/-లాన్‌. ఇంతలో ఓ రోజు  ఒక అపరిచిత వ్యక్తి నుంచి అతడికి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. ‘కశ్మీర్‌ ఉన్నది నీవు సైకిల్‌ తొక్కడానికి కాదు. నువ్వు అక్కడ అడుగుపెట్టావో..లేపేస్తాం, జాగ్రత్త’ అంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి నిఖిల్‌ను బెదిరించాడు. దీంతో కంగారు పడిన నిఖిల్‌ వెంటనే స్థానిక పోలిస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ బెదిరింపు నేపథ్యంలో అతడి టూర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.