కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం

-12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు గాయాలు
శ్రీనగర్‌: జమ్మూ-కాశ్మీర్‌ఓని అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వానం బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన జవాన్లను సమీప ఆసుపత్రికి తరలించారు.