కుటుంబ పెద్ద మరణించడంతో ఆత్మహత్య
కర్నాటకలో విషాద ఘటన
బెంగళూరు,సెప్టెంబర్30 జనంసాక్షి : ర్నాటక రాష్ట్రం మంగళూరు ప్రాంతంలోని మైసూర్లో ఇంటి పెద్ద చనిపోయాడని ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఓ మహిళ తన కూతురు, కుమారుడితో కలిసి నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం?. కిషన్(60), కవిత(60) అనే దంపతులు తన కుమారుడు కౌశిక్, కూతురు కల్పితతో కలిసి జీవిస్తున్నారు. ఈ మధ్యలో కిషన్ చనిపోవడంతో కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో భర్త లేని జీవితం వ్యర్థం అనుకోని కవిత తన కూతురు, కుమారుడితో కలిసి చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. తన ఇంట్లో కుక్కతో పాటు వాళ్లు ముగ్గురు నేత్రావతి నది వద్దకు చేరుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే స్థానికులు గుర్తించి నదిలో నుంచి కుక్కను బయటకు తీసి వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో రెండు మృతదేహాలను బయటకు తీశారు. సదరు మహిళ కుమారుడి మృతదేహం కోసం గత ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.