కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి అని
ఎం.ఎస్.పి జిల్లా కో కన్వీనర్, అబ్రహం మాదిగ అన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ను కలసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై పార్లమెంటులో మాట్లాడాలని మందకృష్ణ మాదిగ అదేశాల మేరకు మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కో కన్వీనర్ అబ్రహాం మాదిగ నాయకత్వంలో వెళ్ళిన బృందం జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు  పాటిల్ ను  వారి నివాసంలో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధతకు సంబంధించిన ఆవశ్యకతను ఎంపీ కి వివరించడం జరిగింది అని అబ్రహం మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనార్థన్,లిబ్నీ,కిట్టు,నర్సింములు,మధు,అగస్టిన్, ప్రసాద్ కూమార్ తదితరులు పాల్గొన్నారు.