కేంద్ర ప్రభుత్వాన్ని నలదీస్తామన్న భాజపా నోటీసు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బొగ్గు కుంభకోణం అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి బొగ్గు కుంభకోణంపై చర్చ చేపట్టాలని కుంభకోణంపై చర్చ చేపట్టాలని నోటీసు ఇచ్చినట్లు భాజపా నేత ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. 2జీ,బొగ్గు కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.