కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ …


దేవరుప్పుల,మే 11(జనం సాక్షి):ఎల్లుండి నుంచి పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం కావడంతో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.వరంగల్ సీపీ అదేనుసారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకర్గం దేవరుప్పుల మండల కేంద్రంలోని దేవరుప్పుల లో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి చౌరస్తా వరకు నిర్మాల గ్రామంలో ప్రతి వడవాడ తిరుగుతూ ప్రజలకు చైతన్యం చేస్తూ శనివారం దేవరుప్పుల ఎస్సై చెన్నకేశవులు,పాలకుర్తి ఎస్సై ప్రసన్న కుమార్ తో కలిసి సీఐ మహేందర్ రెడ్డి 30 మంది సెంట్రల్ పోలీస్ ఫోర్స్, ,బీఎన్ ఎస్ఎస్ బీ ,స్థానిక పోలీసు సిబ్బంది తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.