కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్న రాంసింగ్‌

-జైలు అధికారులు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఢిల్లీ సామూహిక అత్యాచార కేసు కీలక నిందితుడు రాంసింగ్‌ గత కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నాడని జైలు అధికారులు చెప్పారు. నిన్న రాత్రి భోజనం చేయలేదని చెప్పారు. రాంసింగ్‌ ఈ ఉదయం 5 గంటలకు జైలులోని 3వ నెంబర్‌ బ్యారాక్‌లో దుస్తులతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనితోపాటు సెల్‌లో మరో ఇద్దరు నిందితులు ఉన్నారని అధికారులు చెప్పారు.