గాలి ఆస్తుల అటాచ్మెంట్పై వాదనలు ప్రారంభం
ఢిల్లీ : ఓఎంసీ కేసులో గాలిజనార్థన్రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్పై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థలో ఈరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. గాలి జనార్థన్రెడ్డికి చెందిన రూ.884 కోట్ల ఆస్తుల అటాచ్మెంట్పై ఈడీ వాదనలు వినిపించనుంది. గాలి ఆస్తుల అటాచ్మెంట్ కోరుతూ గతేడాది డిసెంబరు 7న బెంగుళూరు ఈడీ అధికారులు పిటిషన్ వేశారు.గనుల తవ్వకాలు, ఖనిజం రవాణాలో గాలి జనార్థన్రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ నిర్థారించింది.