గిజా పిరమిడ్ల వద్ద పేలుడు
పర్యాటకులే టార్గెట్గా పేలుడు, నలుగురు మృతి
కైరో,డిసెంబర్29(జనంసాక్షి): ఈజిప్టులో పర్యాటకులతో వెళ్తున్న బస్సును పేల్చారు. వియత్నం పర్యాటకులతో వెళ్తున్న బస్సును టార్గెట్ చేస్తూ పేలుడుకు పాల్పడ్డారు.ఈ పేలుడు వల్ల నలుగురు మృతిచెందారు. మరో 10 మంది గాయపడ్డారు. గిజా పిరమిడ్ల విహారయాత్రకు వచ్చిన పర్యాటకులను టార్గట్గా పేలుళ్లకు పాల్పడ్డారు.ఈ ఘటనలో టూరిస్టు గైడ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆల్ మారియోటా రోడ్డు వద్ద అమర్చిన పేలుడు పదార్థం విస్పోటనం చెందడంతో బస్సు అదుపు తప్పింది.