ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు , మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సంకినేని వెంకటేశ్వర రావు మాట్లాడుతూ దేశానికి వాజ్ పేయి చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.విలువలతో కూడిన రాజకీయాలు వాజ్‌పేయి సొంతమని , అజాత శత్రువుగా పేరు గడించారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండీ అబిద్ , కౌన్సిలర్ పల్సా మహాలక్ష్మి , అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, జిల్లా నాయకులు సలిగంటి వీరేంద్ర , గజ్జల వెంకటరెడ్డి, చల్లమల్ల నరసింహ, మల్సూర్ గౌడ్, తుక్కాని మన్మధ రెడ్డి , సంధ్యాల సైదులు, బూర శకుంతల, మీర్ అక్బర్ , బూర మల్సూర్ గౌడ్, దోసకాయల ఫణి నాయుడు, జోగం శ్రీనివాస్ , తోనూకునూరి సంతోష్ , జల్లి గణేష్ , దాసరి వెంకన్న, రవివర్మ రెడ్డి, బొజ్జ పరశురాములు, కొప్పుల క్రాంతి రెడ్డి,బిట్టు నాగరాజు, మోదాల విజయ్, లకావత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.