ఘోర రోడ్డు ప్రమాదాలు

వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది మృతి
రాయ్‌పూర్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ):  ఛత్తీస్‌ఘడ్‌ దంతెవాడ సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున విశాఖ నుంచి దంతెవాడ వెళ్తుండగా కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాద జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతి చెందిన వారు విశాఖ వాసులని.. నిమ్స్‌ ఆసుపత్రి డాక్టర్‌ సునీత కుటుంబంగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్‌లో ఆరుగురు మృతి
మధ్యప్రదేశ్‌ లోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్‌, తేజాజీ నగర్‌లో తెల్లవారుజామున రెండు కార్లు ఢీకొట్టకోవడంతో ఆరుగురు మృతి చెందగా మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఆటో రిక్షాను ఢీకొట్టి నదిలో పడిన కారు
మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలోని ఓర్చా పట్టణంలో ఓ కారు నదిలో పడిపోయింది. ఇరుకు వంతెనపై ప్రయాణిస్తూ.. ఆటో రిక్షాను ఢీకొట్టడంతో..కారు నదిలో పడిపోయింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు నీటిలో మునిగారు. నీరు ఎంతో లోతు లేకపోవడంతో కారు పూర్తిగా మునగలేదు. ఆ కారు
మునిగిపోతుందనే కంగారులో.. ఒకరు ఆ బిడ్డను వంతెనపై సాయం చేయడం కోసం నిలుచున్న వ్యక్తులకు విసిరారు. అయితే, వారు ఆ బిడ్డను పట్టుకోవడంలో విఫలయ్యారు. ఆ బిడ్డ వారి చేజారి నీటిలో పడింది. వంతెన విూద ఉన్న ఓ వ్యక్తి వెంటనే నీటిలోకి దూకి ఆ బిడ్డను రక్షించాడు.