చంద్రబాబును ఫోన్‌లో పరామర్శించిన రజనీకాంత్

అమరావతి:తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలుగుదేశం అధినేత చంద్రబాబును పరామర్శించారు. చంద్రబాబు పట్ల వైసీపీ నేతల పదజాలాన్ని అన్ని వర్గాల ప్రముఖులూ ఖండిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన ఘటనలను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌.. చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్‌ నేత మైత్రేయన్‌ కూడా బాబుతో ఫోన్‌లో మాట్లాడారు. 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని.. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డానని ఆయన ట్వీట్ చేశారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.