చంద్రబాబు కంట్లో నీళ్లు రాకున్నా డ్రామాలు

ఆయనే మా కుటుంబ సభ్యలు గురించి ప్రస్తావించారు

బాబు హాయంలోనే మా చిన్నాన్న హత్యజరిగింది

ఎంపి అవినాశ్‌ రెడ్డిపై అనవసర ఆరోపణలు

మాకుటుంబం మధ్య చిచ్చు పెట్టాలని చూశారు.

అసెంబ్లీలో సిఎం జగన్‌ ఘాటు వ్యాఖ్యలు

అమరావతి,నవంబర్‌19 (జనం సాక్షి  ) :   ప్రతీ అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తారని.. చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసని  అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతల హైడ్రామాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు.. తన రాజకీయ అజెండానే ఆయనకు ముఖ్యం అని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు. చంద్రబాబు సంబంధంలేని విషయాలు తీసుకువచ్చి.. రెచ్చగొట్టారు. కానీ విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడి ఆశీస్సులు.. ప్రజల దీవెనలు ఉన్నంత కాలం మమ్మల్ని ఎవ్వరు కూడా అడ్డుకోలేరని తెలిపారు. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబును వ్యతిరేకించారు. శాసనమండలిలో కూడా టీడీపీ బలం పూర్తిగా పడిపోయింది. మండలి ఛైర్మన్‌గా దళితుడు, నా సోదరుడు మోషేన్‌రాజు ఈ రోజు బాధ్యతలు తీసుకుంటున్నారు. సభలో చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావన లేదు. మా అమ్మ, చెల్లెలు, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారు. తప్పుడు వార్తలు పదేపదే చెప్తే నిజం అవుతుందని అనుకుంటున్నారు. చంద్రబాబు కళ్లల్లో నీళ్లు లేకపోయినా నీళ్లు వచ్చాయని డ్రామా చేశారని అన్నారు మా చిన్నాన్న గురించి చంద్రబాబు మాట్లాడతాడు.. నా నాన్న తమ్ముడు నా చిన్నాన్న. ఒక కన్ను మరో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది. నా చిన్నాన్నను ఎవరైనా ఏదైనా చేసుంటే వారే చేసుండాలి. వంగవీటి రంగ హత్య, మాధవరెడ్డి హత్య, చంద్రబాబు హయాంలోనే జరిగాయి. మ్లలెల బాబ్జీ తన సూసైడ్‌ నోట్‌లో కూడా రాశారని సీఎం జగన్‌ తెలిపారు. వ్యవసాయంపై సభలో చర్చ సందర్భంగా విపక్షాలు లేకపోవడం బాధాకరం. ప్రతిపక్షం అంటే సూచనలు, సలహాలు ఇవ్వాలి. రైతు సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకువచ్చాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. గత ప్రభుత్వం మహిళలు, రైతులకు ఇచ్చిన హావిూలను నేరవేర్చలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలన్నింటిని నేరవేర్చాం అని సీఎం జగన్‌ తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను వైసీపీ నాయకులు ఎవరూ కూడా ప్రస్తావించలేదని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కావాలంటే సభా రికార్డులను పరిశీలించుకోవచ్చని ఆయన సూచించారు. సంబంధం లేని విషయాలను తీసుకొచ్చి సభలో రెచ్చగొట్టారని దుయ్యబట్టారు.