చత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ హవా!

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ కూడా వెనుకబడ్డారు. తొలి రౌండ్‌ కౌంటింగ్‌లో ఆయన వెనుకంజలో ఉన్నారు. ఆయన రాజ్‌నంద్‌గావ్‌ నుంచి పోటీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కరుణా శుక్లా ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్‌ 41 స్థానాల్లో ముందంజలో ఉండగా, భాజపా 28 చోట్ల ముందంజలో ఉంది. బీఎస్పీ కూటమి 4 స్థానాల్లో ముందంజలో వెళ్తోంది. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.