చాలా భయమేసింది: జెనీలియా

t7huepzcబ్యాంకాక్ (ఆగస్ట్ 18): అతి భయంకరమైన బ్యాంకాక్ పేలుళ్ల సమయంలో అక్కడే ఉన్న బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా క్షేమంగానే ఉన్నట్టు ట్వీట్ చేసింది. ఆ సమయంలో జెనీలియా అక్కడే ఉన్నదట. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లినట్టు ఆమె తెలిపింది. పేలుళ్ల సమయంలో ఆ ప్రదేశానికి ఎదురుగానే ఉన్న మాల్‌లో జెన్నీ షాపింగ్ చేస్తోందట.
ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా భయంకరంగా మారిందని, అక్కడ చెలరేగిన మంటలు చూసి చాలా భయమేసిందని, అంతమంది మరణించడం చాలా విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముక్‌ను వివాహం చేసుకున్న జెనీలియా అనంతరం సినిమాలకు దూరమైంది. ఇటీవలె ఓ బిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది