చిటికెలో తెలంగాణ ఇస్తాం : రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ : ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలిపింది. తాము అధికారంలోకి వస్తే చిటికెలో తెలంగాణ ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ ఇచ్చారు. ఇవాళ ఆయన రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే తాము అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తామని రాజ్‌నాథ్‌ తెలియజేశారు.