చిన్నారులను హత్యచేసిన నిందితుల అరెస్టు

న్యూఢిల్లీ : దేశరాజధాని నగరంలో పాఠశాలకు  వెళ్లిన ఇద్దరు అన్నాచెల్లెళ్లను అపహరించి దారుణంగా హత్యచేసిన ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చిన్నారుల బంధువు కూడా వున్నాడు. సులభంగా డబ్బు సంపాధించాలనే దురాశతో అతను తన స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్లిన పిల్లలను అపహరించారు. అనంతరం డబ్బుకోసం చిన్నారుల తల్లిదండ్రులను డిమాండ్‌ చేశారు. అయితే పిల్లలు తమ గురించి వెల్లడిస్తారన్న అనుమానంతో వారిని హత్య చేసినట్టు తెలియవచ్చింది.