చెయ్యేరు వరదల్లో చిక్కుకున్న బస్సు

అనంతపురం,నవంబర్‌19(జనం సాక్షి  )

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలో భీతావాహ పరిస్థితి నెలకొంది.భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చెయ్యేరు వరదలో కొట్టుకుపోయి 16 మంది గల్లంతు అయ్యారు. నది మధ్యలో ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు బస్సు టాప్‌ పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచేస్తున్నారు. అనంతపురం చిత్రావతి నదిలో 10 మంది చిక్కుకున్నారు. కల్యాణిడ్యామ్‌ 3గేట్లు తెరవడంతో ఉధృతంగా స్వర్ణముఖి నది ప్రవాహిస్తుండడంతో అధికారులు రిజర్వాయర్‌ గేట్లు మూసివేయడంతో లోతట్టు ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పడుతుంది.