చోటెగుద్ర గ్రామంలో దారుణం

సర్పంచ్‌ను హత్య చేసిన మావోయిస్టులు

 ఛత్తీస్‌గఢ్‌ : దంతెవాడ జిల్లాలోని చోటెగుద్ర గ్రామంలో దారుణం జరిగింది. ఆ గ్రామ సర్పంచ్‌ను నిన్న రాత్రి మావోయిస్టులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు చోటెగుద్రకు చేరుకున్నారు. అక్కడ భారీగా బలగాలు మోహరించారు. చోటెగుద్ర పరిసరాల్లో బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి. సర్పంచ్‌ నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.