చౌటుప్పల్‌లో దొంగల అరెస్ట్‌

నల్లగొండ, జనంసాక్షి: జిల్లాలోని చౌటుప్పల్‌లో ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 10 తులాల బంగారం, ఇండికా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.