ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఆగడంః ముగ్గురు మృతి

రాయ్‌పూర్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం కాంకేర్‌ జిల్లాలో ఓ డీజిల్‌ ట్యాంకర్‌ను పేల్చి వేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. పలువురికి గాయాలైనట్టు సమాచారం. అటవీ ప్రాంతంలో కంకర రోడ్డుపై వెళ్తున్న ఈ ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకొని పేల్చివేశారు. అయితే, ఇది భద్రతా సిబ్బందికి చెందినదని సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌, సుకుమా, బీజాపూర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.