జమ్మూలో చెలరేగిన హింస.. ఆరుగురు మృతి

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలోని సిర్నో గ్రామంలో శనివారం ఉదయం భీకరమైన వాతావరణం ఏర్పడింది. అక్కడ ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందండంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. బలగాలకు ఉగ్రవాదులు తారసపడడంతో.. ఇరు వర్గాల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు, 8 మంది పౌరులు మృతి చెందారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్న క్రమంలో స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరో 50 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొత్తంగా అక్కడ భీకరమైన వాతావరణం ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు.