జలియన్‌వాలాబాగ్‌ను సందర్శంచిన బ్రిటన్‌ ప్రధాని

న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అమృత్‌ సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ ప్రాంతాన్ని సందర్శంచారు. భారత స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా జలియన్‌వాలాబాగ్‌ వద్ద జరిగిన ఆనాటి వూచకోత ఘటనపై ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. బ్రిటీష్‌ చరిత్రలో ఈఘటన అత్యంత దురదృష్ట కరమైనదిగా పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శంచిన మొదటి బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరానే. అనంతరం కామెరాన్‌ స్వర్ణ దేవాలయాన్ని సందర్శంచి ప్రార్ధనలు చేశారు.