టిటిడి మాజీ ఛైర్మన్ కన్నుమూత
బెంగళూరు, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ డి. కె ఆదికేశవులు నాయుడు (71) బెంగళూరులోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన హృద్రోగ వ్యాదితో వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన చిత్తూరు లోక్సభ సభుడిగా పనిచేశారు.