టిటిడి మాజీ ఛైర్మన్‌ కన్నుమూత

బెంగళూరు, జనంసాక్షి:  తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ డి. కె ఆదికేశవులు నాయుడు (71) బెంగళూరులోని ఆసుపత్రిలో  కన్నుమూశారు. ఆయన హృద్రోగ వ్యాదితో వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన చిత్తూరు లోక్‌సభ సభుడిగా పనిచేశారు.