టిడిపి అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

చిత్తూరు,నవంబర్‌6 (జనంసాక్షి) : టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురవడం కలకలం రేపుతోంది. బంగారుపాళ్యం, కలకడ జడ్పీటీసీ స్థానాలకు.. టీడీపీ అభ్యర్థులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్లు సక్రమంగా లేకపోవడంతో.. తిరస్కరించనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కలెక్టర్‌కు ఇద్దరు అభ్యర్థులు అప్పీల్‌ చేశారు. కలెక్టర్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.