ట్రాక్టర్‌ బోల్తా: 22మందికి గాయాలు

విజయనగరం,డిసెంబర్‌10 జనంసాక్షి:  విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడిరది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమం ఉంది. మెంటాడ మండలం చింతాడవలస గ్రామానికి చెందిన వారు కిండం అగ్రహారంలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను విశాఖకు తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 35 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.